Friday, April 19, 2024

ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు బీభత్సం.. డివైడర్ ను ఢీ కొట్టి..

కర్నూలు జిల్లాలోని డోన్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. రెయిలింగ్ దాటి బస్సు ఆగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతపురం నుంచి కర్నూలుకు వస్తున్న ఆర్టీసీ బస్సు డోన్ లోని ఫ్లైవోవర్ ఢీవైడర్ ను ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రెయిలింగ్ పెచ్చులు ఊడి పడి పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement