Thursday, April 25, 2024

రైతులకు రూ.1834కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ.. సీఎం జగన్

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ.1834కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 2020-21 రబీ, 2021 ఖరీఫ్ లో పంట రుణాలు సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతులకు రూ.160కోట్ల వడ్డీ రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.1837కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ, ఇప్పటి వరకు మొత్తం వడ్డీ రాయితీ రూ.1834 కోట్లు ఇచ్చామన్నారు. రైతులకు అండగా ఒకేసారి రెండు రకాల సాయం చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement