Thursday, April 25, 2024

Breaking: ప్ర‌కాశం జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. కారుకు నిప్పంటుకుని ముగ్గురు స‌జీవ ద‌హ‌నం

ప్ర‌కాశం జిల్లాలో మంగ‌ళ‌వారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఓ కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మార్కాపురం మండ‌లం తిప్పాయ‌పాలెం వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. తిప్పాయ‌పాలెం వ‌ద్ద ఎదురుగా వ‌స్తున్న ఓ కారును లారీ ఢీకొట్టింది. దీంతో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా కారులో మంట‌లు చెల‌రేగాయి. ఊహించ‌ని ఈ ప‌రిణామం నుంచి తేరుకునే లోప‌లే కారు పూర్తిగా ద‌గ్ధం అయ్యింది. కాగా, అందులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే లారీని అక్క‌డే వదిలేసి డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ ప‌రార‌య్యారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల‌ను ఆర్పివేశారు. కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవ‌ర‌నేది ఇంకా తెలియ‌రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement