Tuesday, April 16, 2024

రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ

తిరుప‌తి : రిటైర్డ్ బ్యాంకు మేనేజ‌ర్ ఇంట్లో చోరీ జ‌రిగింది. 52 గ్రాముల బంగారం, లక్షకుపైగా వెండి సామాగ్రిని దొంగ‌లు అపహరించుకెళ్లారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ తేజశ్రీ అపార్ట్ మెంట్ 505 లో ఈచోరీ ఘటన చోటుచేసుకుంది. ప్రసన్న కుమార్ తన భార్యతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లి ఇవాళ‌ తిరుపతికి వ‌చ్చారు.

అయితే ఇంటికి వ‌చ్చేస‌రికి తలుపులు బద్దలుకొట్టి బీరువా తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి తిరుచానూరు పోలీసులు క్లూస్ టీం చేరుకొని ఆధారాల సేక‌రించారు. అపార్ట్ మెంట్ లో ఉన్న సీసీ కెమెరాల నిక్షిప్త హార్డ్ డిస్క్ ను దొంగలు తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు తిరుచానూరు ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement