Thursday, March 28, 2024

చేపల మార్కెట్లకు 4 గంటలే అనుమతి

కరోనా ఉధృతి  నేపథ్యంలో మార్కెట్లలో రద్దీని నియంత్రించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం విజయడ నగరంలోని చేపల హోల్‌ సేల్ మార్కెట్, రిటైల్ వ్యాపారానికి ఉదయం 6 నుంచి 10 గంటల వ‌ర‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ తెలిపారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్  ఆదేశాల మేరకు నగరంలోని చేపల మార్కెట్లు ఆదివారం ప‌రిమితంగా వ్యాపారం చేసుకోవాల‌ని సూచించారు. నగర పాలక సంస్థ కబేళా యథావిధిగా పని చేస్తోంద‌న్నారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున మార్కెట్లు, షాపుల్లో ఐదుగురికి మించి గుమికూడకుండా షాపుల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు క్రమ పద్దతిలో కొనుగోలు చేసుకొనేలా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ఎవరు చేపల విక్రయాలు నిషేదించినట్లు తెలిపారు. తమ ఆదేశాలు ఉల్లఘింస్తే వారిపై ఖఠీన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement