తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ కే.ధనంజయ రెడ్డి, సీఎం స్సెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement