Thursday, April 25, 2024

రోడ్డు పనులు ఆపండి: కాంట్రాక్టర్ కు వైసీపీ నేత బెదిరింపులు

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత జయరామిరెడ్డి ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయదుర్గం – కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులేలా చేస్తారని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేసింది. డీఎంసీ అనే సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది. అయితే, విషయం తెలిసిన వైసీపీ నేత జయరామరెడ్డి కాంట్రాక్టర్‌ను కలిసి వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. “ఏయ్ మీ వాడిని వచ్చి మాట్లాడమనండి. నా ఫోన్ ఎత్తడా. పనులన్నీ అపేయండి. లేకుంటే అన్ని పగులగొట్టిస్తా. చేతనైతే పోలీసు కంప్లైంట్ ఇవ్వమనండి. నాకు కొత్తేం కాదు. నాకు తెలియకుండా పని మెుదలుపెడతాడా. నేను ఎవర్ని వదలను” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement