Thursday, April 25, 2024

AP | బాలిక‌పై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన పోక్సో కోర్టు

చిత్తూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఏడేళ్ల క్రితం బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి చిత్తూరు పొక్సో కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. ప్రొసీక్యూషన్ కథ‌నం మీటకు 2014 సంవత్సరంలో గంగవరం మండలం మారేడుపల్లికి చెందిన బాలాజీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కెసులో బాలాజీపై అభియోగాలను సాక్షాదారాలతో ప్రాసిక్యూషన్ నిరూపించింది. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన స్పెషల్ పోక్సో కోర్డు న్యాయమూర్తి శాంతి. దోషి బాలాజీకి జీవిత ఖైదుతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement