Thursday, April 25, 2024

ప్రకాశం జిల్లాలో మైన‌ర్ బాలిక‌పై రేప్ కేసు.. యావ‌జ్జీవ శిక్ష విధించిన కోర్టు

ఒంగోలు క్రైమ్ (ప్రభ న్యూస్) : ఏపీలోని ప్రకాశం జిల్లాలో మైనర్​ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి యావ‌జ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. మార్కాపురం టౌన్ లోని సుందరయ్య కాలనీకి చెందిన మైనర్ బాలికపై అదే కాలనీకి చెందిన చెన్నయ్య (40) అత్యాచారం చేసిన ఘటనలో ఇవ్వాల కోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది. పోక్సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామేశ్వర రెడ్డి ద్వారా సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేయ‌గా.. నేరారోపణ రుజువు కావ‌డంతో జిల్లా రెండో అదనపు జడ్జి సోమశేఖర్, ముద్దాయి చెన్నయ్యకు యావజ్జీవ జైలు శిక్షతో పాటు నాలుగు వేల రూపాయల జరిమానా విధించారు.

సరైన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టి, సమర్ధవంతంగా ట్రయిల్ మానిటరింగ్ చేసి నిందితుడుకి శిక్షిపడటంలో క్రియాశీలకంగా పనిచేసిన దిశ డీఎస్పీ పల్లపు రాజు, సీఐ మాలకొండయ్య, మార్కాపురం సీఐ యం.బీమా నాయక్, దిశ డబ్ల్యుఎస్ఐ రజియా సుల్తానా, కోర్టు లైజన్ ఎస్సై ఎం. వేణుగోపాల్, ఏఎస్సై వెంకటస్వామి, పోక్సో కానిస్టేబుల్ యలమందను జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement