Thursday, April 18, 2024

రామకుప్పం ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్.. ఎస్సై, హెడ్ మ‌ధ్య వివాదం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రామకుప్పంలోని ఎస్ఐ రివాల్వర్ మిస్ అవ్వ‌డం కల‌క‌లం రేపుతోంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉన్న సమయంలో ఎస్ఐ వెంకట శివకుమార్ రివాల్వ‌ర్ మిస్సింగ్ వ్యవహారం బయటపడింది. అయితే రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారంలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం మధ్య ఓ వివాదం నడుస్తోంది.

ఫిబ్రవరి మొదటి వారంలో హెడ్ కానిస్టేబుల్ కు రివాల్వర్ ఇచ్చినట్టు చెబుతున్నాడు ఎస్ఐ వెంకట శివకుమార్. అయితే సర్వీసింగ్ తర్వాత రివాల్వర్ ను ఎస్ఐకి తిరిగి ఇచ్చేశానని చెపుతున్నాడు హెడ్ కానిస్టేబుల్. మరోవైపు ఈ విషయం గురించి తెలుసుకున్న అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement