Saturday, April 20, 2024

కడప జిల్లాలో వర్ష బీభత్సం.. చూస్తుండగానే కాల్వలోకి ఒరిగిన ఇల్లు..

క‌డప జిల్లాలో ఈమ‌ధ్య‌ కురిసిన వాన‌ల‌తో వరదల పోటెత్తాయి. ఆ బీభ‌త్సం నుంచి ప్రజలు ఇంకా తేరుకోనే లేదు. మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఇప్పటికే నిండిన చెరువులు, జలాశయాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే జిల్లాలోని ఊటుకూరు చెరువుకు మరమ్మతులు చేశారు. ఇప్పుడా చెరువుకు ఏ క్షణాన అయినా గండి పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఇక, కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని ముందే గమనించిన ఆ ఇంట్లోని వారు బయటికి వచ్చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఆ ఇల్లు కాలువలోకి పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement