Friday, March 29, 2024

శ్రీవారి సేవలో కేంద్ర రైల్వే మంత్రి

కరోనా విపత్కర పరిస్థితుల నుండి  ప్రతి ఒక్కరిని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వారిని పియూష్ గోయల్ తోపాటు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి,ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎంతో పవిత్రత కలిగిన మహత్తరమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రస్తుతం కరోనాతో ఆంధ్రప్రదేశ్ తో సహా భారత దేశ ప్రజలందరూ ఎంతో తల్లడిల్లుతున్నారని తెలిపారు.  ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement