నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వేస్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గణేష్ శుక్రవారం పరిశీలించారు. రైల్వేస్టేషన్ల, రైళ్లలో ప్రయాణికుల భద్రతతోపాటు, మెరుగైన సదుపాయల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గూడ్స్ రైళ్లకు సంబంధించి ఎగుమతి, దిగుమతులకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. రైల్వేస్టేషన్లలో కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆయన వెంట రైల్వే ఉన్నతాధికారులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్పేజీలను ఫాలో అవ్వండి..