Tuesday, April 16, 2024

రఘురామకృష్ణం రాజుకు గాయాలు అవ్వలేదు: తేల్చి చెప్పిన మెడికల్ బోర్డు..

నర్పాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పోలీసులు కస్టడీలో ఎలాంటి గాయాలు అవలేదని మెడికల్ బోర్డు స్పష్టం చేసింది. రఘురామకృష్ణంరాజు కి అన్ని రకాల పరీక్షలు చేశామని.. పోలీసుల కస్టడీలో ఆయనకు ఎలాంటి గాయలు కాలేదని తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం రఘురామకృష్ణం రాజు ఆరోగ్యం బాగాలేదని నివేదికలో పేర్కొంది మెడికల్ బోర్డు. ఈ నెల 14వ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఎంపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు  కోర్టుకు లిఖితపూర్వకంగ ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ఈ ఫిర్యాదుపై  ఎంపీ రఘురామకృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement