Saturday, April 20, 2024

Breaking: ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఢిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని సీఐడీ పోలీసులకు రాసిన లేఖలో రఘురామ కోరారు.

కాగా, ఈరోజు సీఐడీ విచారణకు రఘురామ హాజరు కావాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొన్ని రోజుల ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement