Friday, April 19, 2024

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. 24న ఉద‌యం ఆన్‌లైన్‌లో వెల్ల‌డి

తిరుమల, ప్రభన్యూస్‌ : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను మంగళవారు ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లై న్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జూలై నెలకు సంబంధించిన అష్టదళపాద పద్మారాధన సేవా టికెట్లను నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మే 26 వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26 వ తేది సాయంత్రం ఆన్‌లైన్‌ డిప్‌ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు. భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. కాగా జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్‌ కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్‌ రేపు ఉదయం 9 గటంలకు మొదలౌతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement