Sunday, April 14, 2024

ప్రశ్నాపత్రం లీకేజీ కేసు.. కస్టడీలో ఉన్న వారు రిమాండ్‌కు తరలింపు

చిత్తూరు కార్పొరేషన్‌, ప్రభన్యూస్‌: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసు కస్టడీలో ఉన్న నలుగురు మళ్లీ రిమాండ్‌కు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం పోలీసులు నిందితులైన తిరుపతిలోని నారాయణ స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌ రెడ్డి , ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్‌ కుమార్‌ రెడ్డి , చంద్రగిరిలోని కృష్ణారెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌ , తిరుపతిలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ప్రతినిధి సుధాకర్లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

బుధవారంతో వీరి కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆ నలుగురికి 14 రోజులు రిమాండ్‌ కు ఆదేశించారు . పోలీసులు ఈ నలుగురిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని పోలీసులు అరెస్ట్‌ చూపించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement