Thursday, April 25, 2024

22 మంది రిజర్వు ఇన్‌స్పెక్టర్లకు ఏఆర్‌ డిఎస్పీలుగా పదోన్నతి, బదిలీలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రిజర్వు ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్న 22 మంది అధికారులకు ఏఆర్‌ డిఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం పని చేస్తున్న వీరందరికీ ప్రమోషన్‌ ఇచ్చి వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కడప జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో పని చేస్తున్న పి మహబూబ్‌ భాష అన్నమయ్య జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు డిఎ స్పీగా, వి శ్రీనివాసులును అనంతపురం ఏఆర్‌ డిఎస్పీగా, కెబిఎస్‌ జార్జీ ని విజయవాడ ఇంటిలిజెన్స్‌ ఎస్‌ఎస్‌జి రిజర్వు డిఎస్పీగా పదోన్నతిపై బదిలీ చేశారు. పల్నాడు జిల్లా రిజర్వు విభాగంలో పని చేస్తున్న ఎండిహెచ్‌ ప్రేమ్‌కుమార్‌ను బాపట్ల జిల్లా ఏఆర్‌ డిఎస్పీగా, బి రాజకుమార్‌ను కర్నూలు జిల్లా హోంగార్డ్సు డిఎస్పీగా ప్రమోషన్‌ కల్పించారు. విజయనగరం గ్రే హౌండ్స్‌లో పని చేస్తున్న పి మరియన్‌ రాజును అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఆర్‌ డిఎస్పీగా, ఎస్‌ చిరంజీవిని ఏపీ జెన్‌కో ఏఆర్‌ డిఎస్పీగా, అదేవిధంగా పి నాగేశ్వరరావును విశాఖపట్నం ఏఆర్‌ డిఎస్పీగా ప్రమోషన్‌పై నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పోలీసు కమిషనరేట్‌ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వులో పని చేస్తున్న ఎస్‌ చంద్రమోహన్‌ను నెల్లూరు జిల్లా హోంగార్డ్సు డిఎస్పీగా, కె శంకురయ్యను నంధ్యాల ఏఆర్‌ డిఎస్పీగా, విజయవాడ జిఆర్‌పిలో ఉన్న డి ప్రసాదరావును శ్రీకాకుళం ఏఆర్‌ డిఎస్పీగా పదోన్నతిపై బదిలీ చేశారు. ఇక విశాఖపట్నం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వులో పని చేస్తున్న ఎంవివి సత్యనారాయణను పశి ్చమ గోదావరి జిల్లా ఏఆర్‌ డిఎస్పీగా నియమించారు.

చిత్తూరు జిల్లా హోంగార్డ్సు ఆర్‌ఐగా పని చేస్తున్న బి మురళీధర్‌ను ప్రమోషన్‌ ఇచ్చి జిల్లా ఏఆర్‌ డిఎస్పీగా ఇక్కడే నియమించారు. ఇంటిలిజెన్స్‌ ఎస్‌ఎస్‌జి విభాగంలోని కె శ్రీనివాసును విజయవాడ ఇంటిలిజెన్స్‌ ఎస్‌ఎస్‌జి విభాగం డిఎస్పీగా, ఇంటిలిజెన్స్‌లో ఉన్న మహ్మద్‌ అజ్మతుల్లాను విజయవాడ ఇంటిలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్‌ ఏఆర్‌ డిఎస్పీగా నియమించారు. అక్టోపస్‌లో పని చేస్తున్న ఆర్‌ఐ ఇ కోటిరెడ్డిని డీజీపీ కార్యాలయం స్టోర్స్‌ విభాగం ఏఆర్‌ డిఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఒంగోలు డీటీసీలోని పి వెంకటేశ్వరరావును ఒంగోలు ఏఆర్‌ డిఎస్పీగా, కర్నూలు జిల్లా ఆర్‌ఐ డి ఏడుకొండల్‌ రెడ్డిని విశాఖపట్నం హోంగార్డ్సు డిఎస్పీగా, సిఐడిలోని ఆర్‌ ఐ పి చంద్రశేఖర్‌ను తూర్పు గోదావరి జిల్లా ఏఆర్‌ డిఎస్పీగా, ఇంటిలిజెన్స్‌ ఐఎస్‌డబ్ల్యూ ఆర్‌ ఐ జె శాంతారావుకు ఇక్కడే డిఎస్పీగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. కృష్ణాజిల్లా పి విజయసారధిని కోనసీమ జిల్లా ఏఆర్‌ డిఎస్పీగా ప్రమోషన్‌ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ బి నాగేశ్వరరావును నెల్లూరు హోంగార్డ్సు డిఎస్పీగా పదోన్నతిపై బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement