Friday, March 29, 2024

అన్యమత ప్రచార సామగ్రి తిరుమలలో నిషేధం.. భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీ జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి, తిరుమలకు తీసుకువెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. ఇది టీటీడీ ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిబంధన.

ఇటీవల కాలంలో తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహన రాహిత్యంతో వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీ జెండాలతో రావడం జరుగుతోంది. వీటిని విజిలెన్స్‌ సిబ్బంది వాహన దారులకు విషయం వివరించి వాటిని తీసివేయిస్తున్నారు. కాబట్టి వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement