Friday, March 29, 2024

లారీని ఢీకొట్టిన బస్సు… ప్రయాణికులు సేఫ్

కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి యానాంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement