Thursday, April 25, 2024

ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాలు సంతోషం, విజయంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 2023 సంవత్సరం అందరి జీవితాల్లోనూ కొత్త స్ఫూర్తిని, లక్ష్యాలను, విజయాలను తీసుకురావాలని రాష్ట్రపతి ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, సమ్మిళిత అభివృద్ధికి పునరంకితం కావాలని సంకల్పిద్దామని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement