Monday, April 15, 2024

రెండు కార్లు ఢీ : ముగ్గురికి తీవ్ర‌గాయాలు

రెండు కార్లు ఢీకొని ముగ్గురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చీరాల సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ లోని ఉప్పల్​కు చెందిన ప్రణయ్, విజయవాడకు చెందిన చిన్మయ్ కారులో రామాపురం బీచ్‌కు వెళుతున్నారు. ఒంగోలు నుంచి కారులో రేపల్లె వెళ్తున్న వెంకట్రావు ముందున్న బండిని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. దీంతో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్షతగాత్రులను చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement