Thursday, March 28, 2024

మోపెడ్ ను ఢీ కొట్టిన టిప్పర్.. దంప‌తుల‌కు గాయాలు..

దర్శి, మార్చి 28 (ప్రభ న్యూస్) మోపెడ్ ను టిప్ప‌ల్ ఢీకొని దంప‌తుల‌కు గాయాలైన ఘ‌ట‌న ద‌ర్శిలోని తానచింతల గ్రామంలో చోటుచేసుకుంది. కురిచేడు గ్రామానికి చెందిన దంప‌తులు తాన‌చింత‌ల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో తానచింతల, పోత వరం మలుపు దగ్గర మోపెడ్ ను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో పెనుగొండ యోగిరెడ్డి, బుచ్చమ్మ దంప‌తులకు గాయాల‌య్యాయి. వీరిని దర్శిలోని ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోధు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement