Saturday, April 20, 2024

ప్ర‌మాదానికి గురైన బ‌స్సులు.. ప‌లువురికి గాయాలు..

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదంలో ప‌లువురికి గాయాల‌య్యాయి. రెండు బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సింగరాయకొండలో డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరో ఘటనలో చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తులసి ట్రావెల్స్‌ బస్సు కనుమళ్ల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసులు ఇతర బస్సులో పంపించివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement