Wednesday, April 24, 2024

హత్యా..? ఆత్మహత్యా? కీలకంగా మారిన పోస్టుమార్టం నివేదిక

జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలోని కాలభైరవ స్వామి దేవాలయం ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని ఎర్రకొండయ్య (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రజియా సుల్తాన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎర్రకొండయ్య మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు పోలీసులు తరలించారు.

అయితే చనిపోయిన వ్యక్తికి ఎటువంటి సమస్యలు లేకపోవటం, తన కూతుళ్లకు పెళ్లిళ్లు అయి దేశ, విదేశాల్లో ఉండటంతో ఇది హత్య అయి ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి చొక్కా చినిగి ఉండటం, కట్టుకున్న లుంగీ అస్తవ్యస్తంగా ఉండటం అనుమానాలకు బలం ఏర్పడుతుంది. వీపునకు చిన్న గాయాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఎవరో హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరివేసుకుంటే నాలుక బయటకు రావటం జరుగుతుందని.. అయితే సదరు వ్యక్తి మృతదేహం చూస్తే చనిపోయాక ఉరివేసినట్లు ఉందంటున్నారు. అసలు నిజాలు పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ తెలిసేలా లేవు. ఈ లోగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధిస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement