Saturday, April 20, 2024

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుపై నిరసన

చీరాల (ప్రభ న్యూస్ ):చీరాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్లో రాహుల్ గాంధీ పై తీర్పును శనివారం నిరసిస్తూ నిరసన చేపట్టారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భముగా కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం లో వచ్చిన స్పందన చూసి బిజెపి శ్రేణులు ఓర్చుకోలేక రాహుల్ గాంధీ మీద కేసులు బనాయించి డిస్ క్వాలిఫై చేయాలని చెప్పి ప్రణాళికతో ఈ తీర్పు వారు ఇప్పిచ్చినట్టు ఉందన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ సభ్యులు అలీమ్ బాబు, మణి బాబు, సాల్మన్ బుచ్చిరాజు, రహమత్ అలీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement