Friday, April 19, 2024

పేదల కోసం 28 టాయిలెట్స్..

మేదరమెట్ల ప్రభ న్యూస్ : కొరిశపాడు మండలం రావినూతల ఎస్ టి కాలనీలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టైమ్స్ వ్యవస్థాపకుడు పూనా టి రవీంద్రబాబు.8 లక్షల నిర్మాణ వ్యయంతో 28 టాయిలెట్స్ ని కాలనీ వాసుల కోసం నిర్మించారు. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ డి శ్రీనివాసన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యా వంతులు కావాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వం అందిస్తున్న, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇస్తున్న ఆర్థిక సహాయ సహకారాలతో వారి పిల్లలను చదివించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. టైమ్స్ వ్యవస్థాపకుడు పూనాటి రవీంద్ర బాబు గతంలో దళిత కాలనీ లో 11 టాయిలెట్స్ నాలుగు లక్షల నిర్మాణ వ్యయంతో నిర్మించార‌ని తెలిపారు.

ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది అని గ్రహించి సమాజంలో ప్రతి ఒక్కరు పరిశుభ్రత, మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పడాల ట్రస్ట్ సౌజన్యంతో టాయిలెట్ నిర్మాణం తలపెట్టామ‌న్నారు. మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలలో చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ .. స్టాంప్స్ జాయింట్ ఇన్ స్పెక్టర్ జనరల్ సరోజ, విశ్రాంత పరిషత్ విద్యాధికారి మోపర్తి వెంకట్రావు, గ్రామ సర్పంచ్ విజయ వీణ ,క్లీన్ అండ్ గ్రీన్ నిర్వాహకులు మోపర్తి కృష్ణ, అను బ్రోలు ప్రభాకరరావు, దామా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement