Friday, April 26, 2024

అదృశ్యమైన బాలుడు అప్రమత్తమైన పోలీసులు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామంలో 11 ఏళ్ల బాలుడు అదృశ్యమైన సంఘటన పోలీసులకు సవాలుగా మారింది. అక్కపల్లి గ్రామానికి చెందిన భూమా శ్రీనాథ్ అదే 11 ఏళ్ల బాలుడు ఈ నెల 22వ తేదీ శనివారం రాత్రి 8 గంటల సమయంలో తన స్నేహితులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి శ్రీనాథ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు భూమా ఓబులేసు, నారాయణమ్మ ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు గత 24 గంటలుగా పలు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల వల్ల ఫలితం కనిపించకపోవడంతో డి.ఎస్.పి కిషోర్ కుమార్ కేసును మరింత సవాలుగా తీసుకున్నారు. సీఐ ఫిరోజ్, ఎస్ఐలు బ్రహ్మనాయుడు, సాంబ శివయ్య, మాధవరావుతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శ్రీనాథ్ తో స్థానికంగా ఉండే సన్నిహితులను ప్రశ్నించారు. బాలుడు అదృశ్యం కావడం పై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ కొడుకు ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును అని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement