Wednesday, April 24, 2024

వేటపాలెంలో క్షుద్రపూజల కలకలం..

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. క్షుద్రపూజలతో తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని.. ఓ మాంత్రికుడుని రామాపురంలోని గుడిలో మత్స్యకారులు నిర్బంధించారు. గ్రామంలోకి రాకుండా మీడియాను, పోలీసులను మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాంత్రికుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement