Saturday, April 20, 2024

విడదల రజినీ పర్యటనలో అపశ్రుతి.. కారును ఢీకొట్టిన వాహనం..

ప్రకాశం : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజినీ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం మార్కాపురం పర్యటనకు వచ్చిన ఆమె జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో కలిసి మార్కాపురం వెళుతున్న సందర్భంగా.. మార్కాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద రహదారిపై మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును మంత్రి విడదల రజినీ వాహనం ఢీ కొట్టింది. దీంతో కారు దెబ్బతిన్నది. ఆ సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాహనంలోనే ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు జరగలేదు. మంత్రి వాహనం ముందు భాగం పాక్షికంగా దెబ్బతినడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement