Thursday, April 25, 2024

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో.. విద్యార్థినుల ప్రతిభ

యర్రగొండపాలెం : ఈనెల 20వ తేదీన స్కూల్‌ గేమ్స్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి బాలికల అండర్‌ 17 కబడ్డీ పోటీల్లో యర్రగొండపాలెం విద్యార్థినులు ప్రతిభ చూపారని హెచ్‌యం పి.వి శేషారావు తెలిపారు. తుదిపోరులో తెలంగాణా, ఆంధ్ర జట్ల మధ్య నిర్వహించగా ఆంధ్రజట్టు విజేతగా నిలిచిందని, ఆంధ్ర జట్టులో జిల్లాలోని యర్రగొండపాలెం మండల పరిషత్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు షేక్‌. అర్షియా, బాగావత్‌ పుష్పాంజలిబాయిలు ఉన్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో పాఠశాలకు పేరుప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థినులకు పాఠశాల ఆవరణలో నిర్వహించిన అభినందన సభకు యంఈఓ పి.ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి. బాల్యమిత్రమండలి సభ్యులు, దాతలు చలువాది శ్రీను, లక్ష్మిరెడ్డి, హెచ్‌యం శేషారావు, ఉపాధ్యాయులు హాజరై విద్యార్థినులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement