Friday, April 19, 2024

prakasam: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కంభం మండలం రావిపాడులో పాలగిరి రామ్మూర్తి అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామ్మూర్తి స్వగ్రామం పొదిలి మండలం కాటువారి పాలెం. అయితే రామ్మూర్తి కంభం మండలం రావిపాడులోని బంధువుల ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement