Thursday, April 18, 2024

గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు

ప్రకాశం: గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి ఇంట్లో తవ్వకాలు జరిపిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇంకొల్లు పట్టణంలో గల మధురానగర్‌లో ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఇంటి యజమాని షేక్ చాంద్ భాషా ఇంటి మధ్యలో 20 అడుగుల లోతులో గుంటను తవ్వించారు. షేక్ మస్తాన్ అనే తాంత్రికుడు భూగర్భంలో గుప్త నిధులున్నాయని చెప్పడంతో గత మూడు నెలలుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఇంటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement