Saturday, April 13, 2024

చైతన్యజ్యోతి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ చేయూత..

యర్రగొండపాలెం : లివర్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న పట్టణానికి చెందిన చికెన్‌ ..మటన్‌ వ్యాపారి షేక్‌. జానీభాషకు చైతన్యజ్యోతి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సభ్యులు 5వేల రూపాయలు అందజేశారు. జానీభాషకు వైద్యం నిమిత్తం రూ.40లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలియజేయడంతో వైపాలెం ముస్లిం యూత్‌ నాయకులు ఇస్మాయిల్‌ జానీ భాష తరపున అన్ని స్వచ్చంధ సంస్థలు, వాట్సాప్‌ గ్రూపులు, ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వ, ప్రైవేట్‌ టీచర్‌ఒ, రాజకీయ నాయకులను సహాయం చేయమని కోరారు. ఒకపుడు ఎంతోమందికి లేదనకుండా సహాయం చేసిన మంచి వ్యక్తి అని, అనారోగ్యంతో ఆర్థికంగా బాధపడడం తెలుసుకుని తాము ఈ సహాయాన్ని చేసినట్లు ఇతర స్వచ్చంధ సంస్థలు, దాతలు తమకు తోచిన రీతిలో సహాయం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సర్కిల్‌ సభ్యులు వి.కోటేశ్వర్లు, వీరాచారి, మలిపెద్ది రవీంద్రబాబు, అడిపి నాగయ్య, పబ్బిశెట్టి రవి, షేక్‌. మహబూబ్‌భాషా, కొత్త పిచ్చయ్య, జ్యోతి ప్రసాదరావు, సిహెచ్‌ మల్లికార్జున, గ్రంధిశిల కృష్ణ, డి. శ్రీనివాసులు, పి.గురుబ్రహ్మాచారి అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement