Thursday, April 25, 2024

ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్న బీజేపీ సర్కార్ : కాంగ్రెస్ నేత కొండారెడ్డి

దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పుట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా తొలిగించినందుకు నిరసన కార్యక్రమాలు, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తగలపెట్టడం జరిగినది.
జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల‌కు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. బిజెపి ప్రభుత్వం చేసిన ఆరాచకాలను రాహుల్ గాంధీ ఖండిస్తే అవి వక్రీకరిస్తూ బిజెపి ప్రభుత్వం చూపించడం జరుగుతుంద‌న్నారు. ప్రజల కోసం ఎప్పుడు పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నిరంజన్ మోడీ, ఆదాని, విజయ మాల్య లాంటి వారిని సపోర్ట్ చేస్తూ వారిని కాపాడటం నిజం కాదా అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ‌ పట్టించి దోషిగా చిత్రీక‌రించ‌డం సిగ్గుచేట‌న్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి, దర్శి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు సిరిమల్లె, పౌలీస్ దొనకొండ మండల అధ్యక్షులు యద్దనపూడి చిన్నకోటయ్య, ముండ్లమూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి ప్రభుదాస్, కొచ్చేడు మండల అధ్యక్షులు కాటం రమణారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పుట్లూరు జయసింహారెడ్డి, తాళ్లూరు మండల అధ్యక్షులు కరిమల, పిసిసి సభ్యులు సాయికుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement