Friday, March 29, 2024

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

ఓ ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద చోటుచేసుకుంది. అయితే ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన సమయంలో విద్యుత్‌ నిలిచిపోవడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు జిల్లా వింజమూరు వెళ్తుండగా జరిగిన ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్‌, ఏడు విద్యుత్‌ స్తంభాలు ధ్వంసయ్యాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement