Friday, March 29, 2024

బ‌స్సు, లారీ ఢీ.. ఒక‌రు మృతి

కంభం : ప్రకాశం జిల్లా కంభం పట్టణం సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనకనుంచి గిరిధర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొన్న ఘటనలో క్లీనర్ అక్కడి కక్కడే మృతి చెందాడు.
మృతుడు మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన సుబ్బయ్యగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి గిద్దలూరుకు వెళ్తున్న గిరిధర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తూ ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఇసుక లారీని వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో బస్సులోని క్లీనర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement