Wednesday, March 27, 2024

బైక్‌, ట్రాక్టర్‌ ఢీ – యువకుడు మృతి

చీరాల, మార్చి 30 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని వాడరేవు రోడ్డులో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడక్కడే మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈపూరుపాలెం ఎస్ఐ జనార్దన్ వివరాలు మేరకు వంశీ(18) అనే యువకుడు వాడరేవు నుంచి చీరాలకు వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో ట్రాక్టర్ వంశీ ప్ర‌యాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో యువ‌కుడు అక్కడక్కడే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement