Friday, April 19, 2024

జగన్ కు మరోసారి లేఖ రాసిన ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే కేంద్ర గెజిట్‌లో చేర్చాలని లేఖలో కోరారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పునరాలోచించాలని సూచించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతాంగానికి నష్టం జరగకుండా నీటిని అందించాలని కోరారు. రెండేళ్లు అయినా అడుగు ముందుకు పడటం లేదన్నారు.

కాగా, ప్రకాశం జిల్లా టీడీపీకి చెందిన అద్దంకి, పర్చూరు, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, స్వామిలు జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూటిగా తెలియజేస్తూ సీఎంకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement