Thursday, April 25, 2024

Postpone – రేపు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం నుంచి ఎప్పుడెప్పుడు బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ విచారణను వాయిదా వేసింది. వాదనలు వినిపించడానికి ఎంత సమయం కావాలని అవినాష్ , సీబీఐ తరపు న్యాయవాదులను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అయితే గంట సమయం కావాలని సీబీఐ సమాధానం ఇచ్చింది. దీనితో శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు ఈ పిటీషన్ పై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement