Thursday, March 28, 2024

వ్య‌క్తిని ఢీకొట్టిన పోలీసు వేహిక‌ల్‌.. కాళ్లు విరిగి తీవ్ర గాయాలు..

కర్లపాలెం (ప్రభ న్యూస్) : గుంటూరు జిల్లా క‌ర్ల‌పాలెంలో పోలీస్ జీప్ ఢీకొని ఒక వ్యక్తి తీవ్ర గాయాల‌య్యాయి. పోలీసు జీపు ఢీకొట్ట‌న ధాటికి కాళ్లు విరిపోయిన ఘటన జ‌రిగింది. కర్లపాలెం నుండి బాపట్ల వెళ్ళే మార్గంలో ముకుందా టీ స్టాల్ సమీపం లో చోటు చేసుకుంది. బాపట్ల వైపు వెళ్తున్ననగరం పోలీస్ జీప్ అతి వేగంతో ప్రయాణిస్తూ ముందుగా గుండ్రెడ్డి శివ వెంచర్ ముందు ఉన్న షెడ్డును ఢీకొనడంతో షెడ్ పడిపోయింది. అతి వేగంతో ఉన్న జీప్ అదే వేగంతో ముకుంద టీ స్టాల్ కి ముందు ఉన్న వెంచర్ కి నిర్మాణం చేసిన ప్రహరిని ఢీకొనడంతో ప్రహరీ నేలకొరిగింది.

సమీపంలోని ఎం వి రాజుపాలెం కి చెందిన బక్కా సాంబిరెడ్డి ని ఢీకొనడంతో కాళ్లు విరిగి తీవ్ర రక్త స్రావమైంది. సమాచారం తెలుసుకున్న బాధితుని గ్రామస్తులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని సాంబిరెడ్డికి న్యాయం చేయాలని రోడ్ పై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ అంజయ్య బాధితుడి బంధువలతో మాట్లాడి న్యాయం చేస్తాన‌ని చెప్ప‌డంతో ఆందోళ‌న విర‌మించారు. కాళ్ళు విరిగిన సాంబిరెడ్డిని చీరాల వైద్యశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement