Monday, March 25, 2024

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు

రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు కాపాడారు. స్థానిక ఫంగల్ రోడ్డుకు చెందిన ప్రశాంతరెడ్డి ఆర్థిక సమస్యల కారణంగా గురువారం ఉదయం రాంనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం డయల్ 100 కు అందించడంతో నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసుల పర్యవేక్షణలో బ్లూకోల్ట్ హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుల్ రఘులు స్పందించి ఆ యువకుడిని వెంటనే కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి ప్రశాంతరెడ్డిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement