Thursday, March 28, 2024

వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలు.. కాపాడిన పోలీసులు

వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తుండంతో పోలీసులు గుర్తించి ఆ రహదారి గుండా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. అయితే, పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ఈరోజు ఉదయం 20 మంది కూలీలతో ఐచర్ వాహనం.. వాగు దాటడానికి ప్రయత్నించారు.

అయితే, వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐచర్ వాహనము చిక్కుకుంది. కూలీలు హహాకారాలు చేయడంతో గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్సై మహమ్మద్ గౌస్ హిటాచిని తీసుకుని తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాహనం మీద కూర్చుని వాగులోకి వెళ్లి… ఒక్కొక్క మహిళను హిటాచిలోకి జాగ్రత్తగా లాక్కున్నారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దపప్పూరు పోలీసుల సహాయక చర్యలను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement