Wednesday, April 24, 2024

ప్రేమించలేదనే రమ్య హత్య.. సోషల్ మీడియాతో జాగ్రత్త!

ఏపీలో సంచలనం సృష్టించిన బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణ కీలక విషయాలు వెల్లడించాడు. ప్రేమించడానికి నిరాకరించిందనే నెపంతోనే రమ్యను శశికృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఇంచార్జీ డీఐజీ  రాజశేఖర్ వివరించారు. ఇన్ స్టాగ్రామ్ లో 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడిందని ఆయన చెప్పారు. అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ…ప్రేమిస్తున్నానని వేధించాడని తెలిపారు. అయితే, ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఆమెను హత్య చేశాడని వివరించారు. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలలో పరిచయ అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. నిందితుడు కత్తితో కోసుకొనే ప్రయత్నం చేశాడని తెలిపారు. సోషల్ మీడియా ట్రాప్‌లో పడకుండా మహిళలు జాగ్రత్త పడాలని డీఐజీ సూచించారు.

ఇది కూడా చదవండి: దళిత బంధుకు మరో రూ.2 వేల కోట్లు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement