Tuesday, April 23, 2024

టీడీపీ నేత అమ‌ర‌నాథ్ రెడ్డికి పోలీసుల నోటీసు

పలమనేరు : నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై, మున్సిపల్ అండ్ పంచాయతీ రోడ్లపై ప్రత్యేకంగా బహిరంగ సభను నిర్వహించకూడదని నిర్దిష్ట షరతులకు లోబడి అనుమతిని మంజూరు చేయడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1.30 నుండి 2.15 గంట‌ల‌ వరకు పలమనేరు టౌన్‌లోని RTC బస్టాండ్ సమీపంలో టవర్ క్లాక్ ముందు, జాతీయ రహదారిపై మొత్తం రహదారిని, సాధారణ ప్రజల రాకపోకలను అడ్డుకుంటూ, బహిరంగ సభను నిర్వహించారు. అయితే ముందు ఇచ్చిన ప్రొసీడింగ్‌ల ప్రకారం ఇచ్చిన షరతులను ఉల్లంఘించినందుకు గాను తెలుగుదేశం పార్టీ నేత అమరనాథ్ రెడ్డి కి పలమనేరు పోలీసులు నోటీస్ జారీ చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement