Wednesday, March 27, 2024

పోలీసులూ జాగ్రత్త… కేసులు పెడితే కోర్టు చుట్టూ తిరగక తప్పదు : చంద్ర‌బాబు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనవసరంగా పోలీసులు కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులు కోర్టు చుట్టూ తప్పదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులను హెచ్చరించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు స్వర్ణముఖి నది ని పరిశీలించిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా అడగాలని నాయకులకు, కార్యకర్తలకు సూచనలిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, ఎర్రచందనం, గంజాయి, లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియా, భూకబ్జాలు ఎక్కువయ్యాయని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారన్నారు.

ప్రజలు ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన సమయం అయిపోయిందని, తనపై 24 బాంబులు పేల్చడం జరిగిందని, నన్ను వెంకటేశ్వరస్వామి కాపాడారని చంద్ర‌బాబు గుర్తు చేశారు. అలాగే ప్రజలకు మీటర్లు మెడకు ఉరితాడుగా వేస్తున్నారన్నారు. హద్దుల్లేని పార్టీ వైయస్సార్ పార్టీ అని తెలియజేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, వాలెంటర్ల ద్వారానే గెలవడం జరిగిందన్నారు. గంజాయి పై తాను పోరాడకుండా పోతే యువత నాశనమ‌య్యేదన్నారు. మైనింగ్ మాఫియాగా వైఎస్ఆర్ పార్టీ తయారైందని చంద్ర‌బాబు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement