Thursday, March 28, 2024

వివేకా కుమార్తె ఇంటి ముందు రెక్కీ.. నిందితుడి అరెస్ట్

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం దర్యాప్తులో కీల‌క విష‌యాలను రాబ‌డుతోన్న నేప‌థ్యంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయ‌న‌ కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఓ వ్య‌క్తి త‌మ ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 10న‌ ఓ అనుమానితుడు త‌మ‌ ఇంటి చుట్టూ తిరిగాడ‌ని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత‌ ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై దృష్టి సారించిన పోలీసులు రెక్కీ నిర్వహించిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు మ‌ణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండిః కడప ఎస్పీకి లేఖ రాసిన వివేకా కుమార్తె

Advertisement

తాజా వార్తలు

Advertisement