Saturday, April 13, 2024

చిత్తూరు జిల్లాలో నాటు బాంబుల కలకలం

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో నాటు బాంబుల కలకలం రేగింది. నాటు బాంబులు సంచిలో వేసుకుని తీసుకు వెళుతున్న దొరస్వామి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు బాంబులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొరస్వామి వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయితీ మహేశ్వరం ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement