Wednesday, April 24, 2024

పోల‌వ‌రం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం – తేల్చేసిన కేంద్రం….

న్యూఢిల్లీ/అమ‌రావ‌తి – పొల‌వ‌రంపై ముందు నుంచి అనుకుంటున్నఅనుమానాలే నిజ‌మ‌య్యాయి.. ప్రాజెక్ట్ ఎత్తు విష‌యంలో ఎపి ప్ర‌భుత్వానికి,కేంద్రానికి మ‌ధ్య కొన్ని రోజులుగా ఊగిస‌లాట కొన‌సాగింది.. ఈ నేప‌థ్యంలోనే పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. అంత మేరకే నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంత వరకేనని చెప్పింది. ఈ రోజు లోక్ సభ లో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉంది. 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయం, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే కల్పించాల్సి ఉంది. అవి ఇంకా పూర్తి చేయలేదు’’ అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయం, పునరావాసాన్ని కల్పించిందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. సహాయ, పునరావాసాలు ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా అందులో జాప్యం జరిగిందని వివరించారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ ప‌నుల‌లో కూడా ఆల‌స్యం జ‌రుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement