Wednesday, April 24, 2024

పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ

 ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ జరగనుంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా  డెల్టాకు స్పిల్ వే మీదుగా ఉదయం 11.30 గంటలకు గోదావరి నీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా ఈసీఆర్ఎఫ్‌ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేశారు. స్పిల్‌వే మీదుగా గోదావరి నీటి విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ తొలి ఫలితానికి ప్రభుత్వం, మేఘా సంస్థ శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో వర్చువల్ ద్వారా  మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌‌, ఆళ్ల నాని పాల్గొననున్నారు. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల కానుంది. ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరనున్నాయి. వర్షా కాల సీజన్‌లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తయ్యాయి. దీంతో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. అతి తక్కువ సమయంలో భారీ పనులు, నిర్మాణాలు పూర్తి చేసి, డెల్టాకు నీరందించే ప్రక్రియను మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి  చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement